సిటీలో క్రికెట్ జోష్.. మల్టీప్లెక్స్ థియేటర్స్లో
క్రీడాభిమానులు తమ స్నేహితులతో కలిసి క్రికెట్ మ్యాచ్ చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే వీరిని ఆకర్షించడానికి బంజారహిల్స్, జూబ్లిహిల్స్, కొండాపూర్ ప్రాంతాల్లో నూతనంగా అత్యధిక సంఖ్యలో లైవ్ టెలికాస్ట్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. వీటిలో ముఖ్యంగా మల్టీప్లెక్స్ థియేటర్లలోనూ క్రికెట్ మ్యాచ్ను ప్రత్యక్షప్రసారం ద్వారా భారీ తెరలపై ప్రదర్శించనున్నారు. కోకాపేట, కొండాపూర్ లాంటి ప్రాంతాల్లో కొన్ని లగ్జర విల్లాలలో కమ్యూనిటీ స్క్రీనింగ్ లో మ్యాచ్ తిలకించడానికి ఏర్పాటు చేశారు. అందుకోసం డబ్బులు కూడ భారీగానే వసూలు చేస్తున్నట్టు టాక్.