హైదరాబాద్లో డ్రగ్స్ భారీగా స్వాధీనం
హైదరాబాద్లో డ్రగ్స్ను భారీగా స్వాధీన పరుచుకున్నారు. బెంగళూరు, హైదరాబాద్ కు సంబంధించిన ఎన్సీబీ అధికారుల జాయింట్ ఆపరేషన్ కొనసాగించారు. ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు డ్రగ్స్ను పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి ఏకంగా ఆస్ట్రేలియాకు తరలించాలని ప్రయత్నం చేశారు. వీరు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ అంతర్జాతీయ మార్కెట్లో కొన్ని కోట్ల రూపాయల విలువ చేస్తున్నదని తెలుస్తోంది. హైదరాబాద్లో ఈ పార్సల్ చేసిన వ్యక్తి ఎవరు..? ఏమిటి అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే అరెస్టు చేసిన వారి నుంచి వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఈడ్రగ్స్కు సంబంధించి ఏదో ఒక ఫార్మసీ కంపెనీకు సంబంధాలున్నాయని ఊహగానాలు వినిపిస్తున్నాయి.