అరె లోకేష్ నీ అబ్బా, దమ్ముంటే రారా: మంత్రి అనీల్

ఏపీలో జరిగిన దాడులకు సంబంధించి ఇప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీ యుద్ధం తారా స్థాయిలో ఉంది. ఈ మాటల యుద్ధం ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటీ అనే దానిపై అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. రాజకీయంగా బలంగా ఉన్న వైసీపీ ని ఇబ్బంది పెట్టడానికి టీడీపీ ప్రయత్నాలు చేస్తుంది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఇక మంత్రి అనీల్ నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసారు.
“లోకేశ్... నీ అబ్బ నిజంగా రాయలసీమలో పుట్టింటే రా... తేల్చుకుందాం. ఎవరు ఎవరి రెక్కలు ఊడగొడుతారో, ఎవరు ఎవర్ని తరిమికొడతారో చూద్దాం. వారం రోజులు నెల్లూరులోనే ఉంటా... ఒక్కడినే తిరుగుతా... దమ్ముంటే అడ్డుకోండి. పవన్ కళ్యాణ్... నీకు కూడా చెబుతున్నా.. సీఎంని తిట్టినప్పుడు మౌనంగా ఉండి, ప్రజాస్వామ్యం అపహస్యమైందని అంటావా... అంటూ అనీల్ కుమార్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: