మా వాళ్ళు చేసింది కరెక్ట్:వైసీపీ ఎంపీ

రాజకీయ చరిత్రలో నిన్నటి రోజు ఓ దుర్దినం అని అన్నారు వైసీపీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకట రమణ. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు నిరసనలకు దిగిన సమయంలో మోపిదేవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు తమ ఉనికి కోల్పోతుందని భయం పట్టుకుంది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. భయంతోనో పెయిడ్ ఆర్టిస్ట్ పట్టాభి లాంటి వారితో ఇష్టానుసారంగా మాట్లాడిస్తున్నారు అని మండిపడ్డారు.
పట్టాభి మాట్లాడే భాష వింటుంటే రక్తం మరిగిపోతుంది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. వైకాపా శ్రేణులు దాడులు సరైనవే అని అన్నారు. టీడీపీ భాష అలా ఉంటే వైసిపి ప్రతి చర్య ఇలానే ఉంటుంది అని అన్నారు ఆయన. అదే విధంగా చంద్రబాబు , అతని అనుచరులు ఓళ్లు దగ్గర పెట్టుకోని మాట్లాడాలి అని మోపిదేవి వెంకటరమణ టీడీపీ నాయకులను హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: