టీడీపీ కి సపోర్ట్ చేసిన బిజెపి ఎంపీ...?

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేతల లక్ష్యంగా జరిగిన దాడులకు సంబంధించి బిజెపి నాయకులు అందరూ స్పందిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న బిజెపి నాయకులు టీడీపీ కి సపోర్ట్ చేస్తున్నారు. బిజెపి రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అని వ్యాఖ్యలు చేసారు. ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులకు తెగబడడం, భయానక వాతావరణం సృష్టించడం గర్హనీయం అని ఆయన వ్యాఖ్యలు చేసారు.
 ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించిన వారిపై దాడులు చెయ్యడం ఫ్యాక్షనిస్టు భావజాలానికి నిదర్శనం అని సుజనా చౌదరి అన్నారు. అదే విధంగా దాడులకు పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి అని విజ్ఞప్తి చేసారు.  వీరిలో వైసిపి నేతలుంటే వారిపై ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని సుజనా చౌదరి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: