నా మీద ప్రేమ ఉన్న వాళ్లకు బీపీ వచ్చింది: జగన్

టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి సిఎం జగన్ సహా వైసీపీ నేతలపై టీడీపీ విమర్శలు చేస్తున్న తరుణంలో సిఎం వైఎస్ జగన్ స్పందించారు. జగన్నన్న తోడు కార్యక్రమంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు నేడు. రాష్ట్రంలో అభివృద్ధిని చూడలేక భూతులు తిడుతున్నారు అని ఆయన ఆరోపించారు. కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు.
ఎవరు అనలేని  వినలేని భూతులు తిడుతున్నారు అని విమర్శించారు. కోర్టులను అడ్డంపెట్టుకుని అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని మండిపడ్డారు సిఎం జగన్.  ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేసారు. పేదలకు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం జరగకుండా అడ్డుకున్నారు అని అన్నారు. ఒక వర్గం మీడియా కూడా మా మీద కక్ష గట్టింది అన్నారు. ప్రతిపక్షాలు మా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నాయి అని... టీవీ చూసి ఆ బూతులు వినలేక దాడులు చేసారని, ఆప్యాయత చూపించే వాళ్ళు బీపీ వచ్చి దాడులు చేశారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: