మీరు తిట్టారు మేం పగలగొట్టాం: కొడాలి మార్క్ కామెంట్స్

టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి విషయంలో ఇప్పుడు ఏం జరగబోతుంది ఏంటీ అనేది ఆసక్తికరంగా మారింది. ఇక దీనికి సంబంధించి టీడీపీ నాయకులు అలాగే వైసీపీ మంత్రులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక దీనిపై తాజాగా మంత్రి కొడాలి నానీ ఘాటుగా స్పందించారు. చంద్రబాబు ఆఫీసులో కూర్చుని జగన్‍ ను తిట్టారు అని ఆయన మండిపడ్డారు.
అందుకే ఆ పార్టీ ఆఫీసును పగలగొట్టారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు 420 - నాలుగు బల్లలు, కుర్చీలు పగలగొడితే ప్రజాస్వామ్యం ఖూనీ ఆయినట్టా అని నిలదీశారు. నీ ఆఫీసులో బల్లలు పగిలితే రాష్ట్రపతి పాలన పెట్టాలా?  అంటూ ఘాటుగా స్పందించారు. చంద్రబాబు బందుకు పిలుపునిస్తే రాష్ట్రంలో బడ్డీకొట్టు కూడా మూయించలేడు  అంటూ ఒక ప్రముఖ ఛానల్ తో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: