అతడొక దుష్టుడు, టీడీపీ నేతపై మంత్రి సంచలన వ్యాఖ్యలు

టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడి విషయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీరుని, టీడీపీ వైఖరి, పట్టాభి వ్యాఖ్యలపై విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తీవ్ర స్థాయిలో స్పందించారు. దేశమంతా గొప్పగా ప్రశంసలు కురిపిస్తున్న ముఖ్యమంత్రి జగనన్న పై పట్టాభి వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలంతా ఖండిస్తున్నారు అని అన్నారు. చంద్రబాబు కొంతమందిని ఉసిగొల్పి ముఖ్యమంత్రి పై నీచంగా మాట్లాడించి రాక్షసానందం పొందుతున్నారు అన్నారు.
నైతిక విలువలు లేని వ్యక్తి పట్టాభి ఒక దుష్టుడు అని ప్రజలంతా చెప్పుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభిని చంద్రబాబు పార్టీ నుంచి సస్పెండ్ చేసి శాశ్వతంగా రాజకీయాలనుంచి తప్పించాలి. అని డిమాండ్ చేసారు మంత్రి. లేదా పట్టాభితో నేనే మాట్లాడించానని చంద్రబాబు ఒప్పుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి అని ఆయన డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: