షర్మిల పాదయాత్ర రోజుకి ఎన్ని కిలోమీటర్లు...?

తెలంగాణాలో రాజకీయ పార్టీ విషయంలో సీరియస్ గా ఉన్న వైఎస్ షర్మిల ఇప్పుడు కాస్త సీరియస్ గా అడుగులు వేస్తున్నారు అనేది అర్ధమవుతుంది. నేటి నుంచి వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర మొదలవుతున్నది. చేవెళ్ళలో ఉదయం 10 గంటలకు శంకర్పల్లి క్రాస్ రోడ్ వద్ద భారీ భహిరంగ సభ నిర్వహించారు. సభ అనంతరం 11.30 గంటలకు పాదయాత్రను ఆమె మొదలు పెడతారు.
ప్రతీ రోజు పది కిలోమీటర్ లు పాదయాత్ర చేస్తారు. కందవాడ గ్రామం లో రాత్రికి ఆమె బస చేస్తారు. 14 నెలలు,4 వేల కిలోమీటర్లు,90 నియోజక వర్గాల్లో పాదయాత్ర చేస్తారని తెలుస్తుంది. ప్రతి రోజు 12 కిలోమీటర్లు పాదయాత్ర చేసేలా కార్యాచరణ అని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ తరం యువతకు నవతరం న్యాయకత్వం స్లోగన్ తో షర్మిల పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ప్రతి నియోజక వర్గంలో మూడు మండలాలు టచ్ చేసేలా రూట్ మ్యాప్ సిద్దం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts

సంబంధిత వార్తలు: