టీడీపీ కార్యాలయంపై దాడిలో వైసీపీ ఉద్దేశం అదేనా?

N.Hari
తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దేవాలయంగా భావిస్తామని, అలాంటి పవిత్రమైన చోటుపై అధికార వైసీపీ దాడిని ఏ మాత్రం సహించేది లేదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో బూతులు ఎప్పుడు మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. తమ వాళ్ళు తిట్టినా తాను వారించానని ఆయన తెలిపారు. కానీ వైసీపీ వాళ్లు చాలా బూతులు మాట్లాడారనీ, వారు ఏం మాట్లాడారు రికార్డు తీస్తే ఇట్లే తెలిసిపోతుందనీ చంద్రబాబు అన్నారు. సీఎంను మంత్రులు ఎప్పుడైనా వారించారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీ టీడీపీ వైసీపీ ఎన్నో దాడులు చేశారు, తమ నాయకులను అరెస్ట్‌ చేశారు, అవమానాలకు గురి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత అరాచకానికి పాల్పడ్డారో మీకు తెలుస్తుందా? అని జగన్‌ను సూటిగా ప్రశ్నించారు చంద్రబాబు. తమను వైసీపీ మంత్రులు, నాయకులు బండ బూతులు మాట్లాడినా, ప్రజాస్వామ్యం కోసం సహించమని చంద్రబాబు అన్నారు. అరెస్టులు తప్ప వైసీపీ ప్రభుత్వం ఇంకేమీ చేయలేదన్నారు. తమ సంకల్పం దెబ్బ తీయలేదన్నారు. పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే ఆఫీసులో మూసివేస్తారు అనేదే వైసీపీ ఉద్దేశమా? అని చంద్రబాబు నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: