బ్రేకింగ్: నేను ఫోన్ చేసినా డీజీపీ నుంచి ఆన్సర్ లేదు: చంద్రబాబు

టీడీపీ రాష్ట్ర కార్యాలయం పై జరిగిన దాడి పై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం పై దుమ్మెత్తి పోశారు. ప్రవర్తన అదేవిధంగా వైసీపీ ని లక్ష్యంగా చేసుకుని చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు. డిజిపి కార్యాలయం పక్కన దాడి జరిగితే అది పోలీసు వ్యవస్థ విఫలం కావడం కాదా అంటూ చంద్రబాబు నాయుడు నిలదీశారు.ఇది పులివెందుల రాజకీయం కాదు అన్న చంద్రబాబు నాయుడు తాను డీజీపీ కి ఫోన్ చేసినా సరే ఆన్సర్ చేయలేదని మండిపడ్డారు.
ఏపీలో రాజ్య ప్రాయోజిత హింస జరుగుతుందని దేవాలయం లాంటి టీడీపీ కార్యాలయంపై దాడికి దిగారని సీఎం అలాగే వైసీపీ కలిసి దాడి చేయించారని చంద్రబాబు నాయుడు ఆరోపణలు గుప్పించారుపిలిస్తే వచ్చి రౌడీయిజం చేస్తే నాశనం అవుతారు అంటూ చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: