బ్రేకింగ్: చంద్రబాబుకు మాటిచ్చిన అమిత్ షా

ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల పై జరుగుతున్న దాడులకు సంబంధించి అలాగే నేడు సాయంత్రం కొంత మంది వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై చేసిన దాడులకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. టిడిపి కేంద్ర కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు నాయుడు వెంటనే హోంమంత్రి అమిత్ షా కి ఫోన్ చేసి జరిగిన ఘటన గురించి వివరించారు.

అయితే దాడి జరిగిన విషయం తనకు తెలియదని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లిఖితపూర్వక ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హోం మంత్రి అమిత్షా చంద్రబాబు నాయుడుకి హామీ ఇచ్చారు.పక్కా ప్రణాళిక ప్రకారం తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు దిగారని చంద్రబాబు నాయుడు హోం మంత్రికి వివరించారు. టిడిపి కేంద్ర కార్యాలయానికి కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని చంద్రబాబు కోరారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులతో తాను మాట్లాడతానని హోంమంత్రి చెప్పినట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: