బిగ్ బ్రేకింగ్; టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇళ్లపై... వైసిపి కార్యకర్తలు దాడులకు దిగడం ఇప్పుడు సంచలనంగా మారింది. రాష్ట్రంలో గంజాయి అమ్మకాలకు సంబంధించి అలాగే గంజాయి సాగుకు సంబంధించి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి  పట్టాభిరామ్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై అదే విధంగా కొంతమంది నాయకుల ఇళ్ల పై వైసీపీ నాయకులు దాడులకు దిగారు.

 

టిడిపి కేంద్ర కార్యాలయం పై వైసీపీ నాయకులు దాడి దిగడమే కాకుండా... కార్యాలయం గేట్లను నెట్టేసి లోపలికి వెళ్లి ఫర్నిచర్ అలాగే అద్దాలపై రాళ్లు విసిరారు. కార్యాలయంలో కనబడిన వారిపై దాడులకు దిగడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఈ దాడులకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గవర్నర్ కి లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు అదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు భద్రత కల్పించాలని గవర్నర్ ను ఆయన విజ్ఞప్తి చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: