నా బిడ్డను ఆశీర్వదించండి: విజయమ్మ ఎమోషన్

తెలంగాణాలో వైఎస్ షర్మిల తన రాజకీయ ప్రస్తానం కోసం కీలక అడుగుల దిశగా ప్రయాణం మొదలు పెడుతున్నారు. ఎలా అయినా సరే వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చుకునే విధంగా షర్మిల చాలా కష్టపడుతున్నారు అనే చెప్పాలి. రాజకీయంగా తనకంటూ ఒక స్పేస్ ని సృష్టించుకోవడానికి షర్మిల చాలా కష్టాలు పడుతున్నారు. ఇక వైఎస్ షర్మిల ఇప్పుడు పాదయాత్ర పేరుతో రెడీ గా ఉన్నారు.
ఇక దీనిపై వైఎస్ విజయమ్మ స్పందిస్తూ... వైఎస్సార్ బాటలో మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్న షర్మిల ను ఆశీర్వదించండి అని కోరారు. రాజన్న సంక్షేమం కోసం,మీ కోసం మొదటి అడుగు షర్మిల వేస్తోంది అని తెలిపారు. షర్మిల ,ప్రజలు కలిసి రాజన్న రాజ్యం కోసం ప్రభంజనం సృష్టించండి అని విజ్ఞప్తి చేసారు ఆమె. వైఎస్సార్ స్వర్ణ యుగాన్ని మళ్ళీ తెచ్చుకోండి అని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts

సంబంధిత వార్తలు: