పొలం సమస్య కోసం వెళ్తే లైంగికంగా వేధించిన ఎమ్మార్వో...?

రెవెన్యూ అధికారులు ఎక్కడో ఒక చోట వివాదాల్లో ఏదోక రూపంలో ఉంటున్నారు. కొందరు అధికారులు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు గుంటూరు జిల్లా యడ్లపాడు తహాశీల్దార్ పై లైంగిక వేదింపుల ఆరోపణలు సంచలనం అయ్యాయి. పొలం సమస్య పరిష్కారం కోసం తహాశీల్దార్ ను కలిసింది ఒక మహిళ. మహిళా పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తహాశీల్దార్... తీరుపై స్పందన లో బాధిత మహిళ ఫిర్యాదు ఇచ్చింది.
ఫిర్యాదు చేసి 20 రోజులైన సరే కలెక్టర్ ఆ విషయం గురించి పట్టించుకోలేదు. తన భార్య పట్ల అసభ్య ప్రవర్తనపై ప్రశ్నించిన భర్త.... ఆవేశం లో తహాశీల్దార్ పై దాడికి దిగడం సంచలనం అయింది. క్రాంతి కుమార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు... రిమాండ్ కి తరలించారు.  ఆత్మాభిమానం తో ప్రశ్నించిన నా భర్త ను పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గమని మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: