వంట‌పాత్ర‌లో మండ‌పానికి వెళ్లి.. ఆ త‌రువాత పెళ్లి..!

N ANJANEYULU
దేశ‌వ్యాప్తంగా నైరుతి ఋతుప‌వ‌నాల కార‌ణంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. అందులో కేర‌ళ‌లో కురిసే వ‌ర్షాలు మాత్రం ఇంతా ఇంత కాదు.   అక్క‌డ కురిసిన వ‌ర్షానికి వ‌చ్చిన వ‌ర‌ద‌తో ఏకంగా ఇల్లులే కొట్టుకుపోతున్నాయి. ఈ సంవ‌త్స‌రం రుతుప‌వ‌నాలు కాస్త ఆల‌స్యంగా తిరోగ‌మించ‌డంతో కేర‌ళ‌లో అతిభారీ వ‌ర్షాలే కురుస్తూనే ఉన్నాయి.  ఇంత వ‌ర్షం కురుస్తున్నా కానీ అక్క‌డ ఓ పెళ్లి జ‌రిగింది. వ‌ర్షం కురిసిన విష‌యం ఒక ఎత్త‌యితే.. అందులో పెళ్లి జ‌రిగిన తీరు హాట్ టాఫిక్.
వారిద్ద‌రూ చెంగనూరులోని ఓ ఆస్ప‌త్రిలో ఆరోగ్య కార్య‌క‌ర్త‌లుగా ప‌ని చేస్తుంటారు.  ఐశ్వ‌ర్య‌, ఆకాశ్‌లు వివాహం చేసుకోవ‌డానికి సిధ్ద‌మ‌య్యారు.  ఓ వైపు వ‌ర‌ద ముంచెత్తుతున్న వారు క‌ళ్యాణ మండ‌పానికి చేరుకున్నారు.  వ‌ర్షం దాటికి రోడ్ల‌న్నీ మునిగిపోయి న‌దిలా త‌ల‌పించినా కూడా ఆ న‌వ జంట పెళ్లి మండ‌పానికి వెళ్లి పెళ్లి చేసుకుంది.  వారు పెళ్లి మండ‌పానికి వెళ్లిన విధానం స‌రికొత్త శైలిలో వింత‌గా వెళ్లారు. ఒక పెద్ద అల్లూమినియం వంట పాత్ర‌లో యువ‌జంట పెళ్లి మండ‌పానికి చేరుకున్నారు. ఆ ప్ర‌దేశం అంతా వ‌ర‌ద‌తో నీరు నిండినా నీటిని లెక్క చేయ‌కుండా వారు వేధిక వ‌ద్ద‌కు చేరుకుని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకోవాల‌నే ల‌క్ష్యంతో అడ్డంకుల‌ను ప‌ట్టించుకోకుండా వెళ్లాల‌ని నిశ్చ‌యించుకున్న‌ట్టు  నూత‌న వ‌ధూవ‌రులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: