వంటపాత్రలో మండపానికి వెళ్లి.. ఆ తరువాత పెళ్లి..!
వారిద్దరూ చెంగనూరులోని ఓ ఆస్పత్రిలో ఆరోగ్య కార్యకర్తలుగా పని చేస్తుంటారు. ఐశ్వర్య, ఆకాశ్లు వివాహం చేసుకోవడానికి సిధ్దమయ్యారు. ఓ వైపు వరద ముంచెత్తుతున్న వారు కళ్యాణ మండపానికి చేరుకున్నారు. వర్షం దాటికి రోడ్లన్నీ మునిగిపోయి నదిలా తలపించినా కూడా ఆ నవ జంట పెళ్లి మండపానికి వెళ్లి పెళ్లి చేసుకుంది. వారు పెళ్లి మండపానికి వెళ్లిన విధానం సరికొత్త శైలిలో వింతగా వెళ్లారు. ఒక పెద్ద అల్లూమినియం వంట పాత్రలో యువజంట పెళ్లి మండపానికి చేరుకున్నారు. ఆ ప్రదేశం అంతా వరదతో నీరు నిండినా నీటిని లెక్క చేయకుండా వారు వేధిక వద్దకు చేరుకుని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకోవాలనే లక్ష్యంతో అడ్డంకులను పట్టించుకోకుండా వెళ్లాలని నిశ్చయించుకున్నట్టు నూతన వధూవరులు తెలిపారు.