కాశ్మీర్ వలస కూలీలకు హెచ్చరిక... హత్య చేసింది తామే.. ప్ర‌క‌టించిన‌ యూఎల్ఎఫ్

N ANJANEYULU
గ‌త కొంత కాలంగా జ‌మ్మూకాశ్మీర్‌లో ఉగ్ర‌వాదులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఏదో ఒక చోట అల‌జ‌డి సృష్టిస్తున్నారు. తాజాగా  ఇద్ద‌రు వ‌ల‌స కూలీల‌ను వారు హ‌త్య చేశారు.  మొత్తంగా ఇప్ప‌టివ‌ర‌కు వ‌ల‌స‌కార్మికుల‌తో స‌హా 11 మందిని హ‌తమార్చారు.  ఈ హ‌త్య‌కు పాల్ప‌డింది తామే అంటూ ఇందుకు సంబంధించి యూనైటేడ్ లిబ‌రేష‌న్ ఫ్రంట్ ప్ర‌క‌టించింది. మ‌రోవైపు కాశ్మీర్ వ‌దిలి వ‌ల‌స కూలీలు వెళ్లిపోవాల‌ని తాజాగా విడుద‌ల చేసి లేఖ‌లో యూఎల్ఎఫ్ హెచ్చ‌రిక జారీ చేసింది.
దేశవ్యాప్తంగా ముస్లింల‌ను హ‌త్య చేస్తున్నార‌ని.. బీహార్‌లో సంవ‌త్స‌ర కాలంలో హిందు అతివాదులు 200 మందికి  పై చిలుకు ముస్లింల‌ను హ‌త్య చేశారు. ముస్లింల హ‌త్య‌ల‌కు ప్ర‌తికారం తీర్చుకుంటాం అని ఆ లేఖ‌లో వెల్ల‌డించింది యూఎల్ఎఫ్‌. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్ర‌సంస్థ అయిన ల‌ష్క‌రే తోయిబాకు చెందిన ఆర్గ‌నైజేష‌న్ ఈ యూఎల్ఎఫ్‌. ఇది ఇలా ఉండ‌గా  జ‌మ్ముక‌శ్మీర్ లెప్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ మ‌నోజ్‌సిన్హా  ఉగ్ర‌వాదులు, వారి సానుభూతి ప‌రుల‌ను వేటాడ‌డంతో ప్ర‌తి ర‌క్త‌పు బొట్టుపై ప్ర‌తీకారం తీర్చుకుంటాం అని ప్ర‌క‌టించారు. జ‌మ్మూకాశ్మీర్ సామాజిక‌, ఆర్థిక పురోగ‌తికి, శాంతికి, ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త అభివృద్ధికి విఘాతం క‌ల‌గ‌కుండా ప్ర‌య‌త్నం చేప‌డుతున్న‌ట్టు వెల్ల‌డించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: