బ్రేకింగ్: కోర్ట్ ఆవరణలో లాయర్ దారుణ హత్య !!!

Surya
ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ జిల్లా కోర్ట్ కాంప్లెక్ లో న్యాయవాదిని అతి దారుణంగా నాటు తుపాకీతో కాల్చి చంప బడ్డాడు. రోజులెక్కే న్యాయవాది తమ విధి నిర్వహణలో భాగంగా తనదగ్గరుకు వచ్చిన క్లయింట్ తో మాట్లాడుతున్న సమయం లో ఈ ఘటన జరిగింది.  షాజహాన్ పూర్ జిల్లా కోర్ట్ కాంప్లెక్ లోని మూడవ అంతస్తునుండి పెద్ద పేలుడు శబ్దం రావడంతో ఓ వ్యక్తి అక్కడ కు వెళ్లి  చూసి  వెంటనే జరిగింది లాయర్లకు చెప్పగా అందరు ఆ ఘటనను చూడడానికి వెళ్లారు. ఆ చనిపోయిన వ్యక్తి ని  భూపేంద్ర ప్రతాప్ సింగ్‌గా గుర్తించారు. 


అతడు గతం లో బ్యాంకు ఉద్యోగస్తుడని నాలుగు సంవత్సరాలుగా లాయర్ ప్రాక్టీస్ చేస్తున్నాడని తోటి లాయర్ల బృందం తెలిపింది. చంపబడ లాయర్ మృతదేహం పక్కన ఓ నాటు తుపాకీ కూడా  లభ్యం అయ్యింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా . పొలిసు అధికారులు కేసు నమోదు చేసుకొని ప్రాథమిక విచారణ చేసారు. అయితే చనిపోయిన వ్యక్తి ఒంటరిగానే ఉన్నట్లు కనిపించిందని .ఘటన జరిగిన సమయంలో అతని చుట్టుపక్కల ఎవరు లేరని తెలుసుకున్నారు. ఫోరెన్సిక్ బృందం అసలు విషయం తెలుసుకునే పనిలో ఉంది. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సిఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: