విశాఖలో ఆ నౌక మళ్ళీ మునిగిపోతుందా...?

కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఐ ఎస్ ఓ 9001-2015 గుర్తింపు సర్టిఫికెట్ ను ఆవిష్కరించారు మంత్రి అవంతి శ్రీనివాస్. మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ... శ్రీ కనక మహాలక్ష్మి ఆలయానికి మంచి నాణ్యత ప్రమాణాలు పాటించడం వల్ల ఈ గుర్తింపు వచ్చింది అని అన్నారు ఆయన. విశాఖ లో.. సింహాచల వరాహ లక్ష్మీ నరసింహ స్వామి, కనక మహా లక్ష్మీ ఆలయాలు వల్ల నగర ప్రజలు సుభిక్షంగా, ఆనందంగా ఉన్నారు అని వ్యాఖ్యలు చేసారు.
కనక మహా లక్ష్మీ ఆలయానికి వెళ్లే మార్గ సమస్య పరిష్కరిస్తాం అని అన్నారు. విశాఖ నగరం లో ఎంవి మా నౌక, మళ్ళీ మునిగే పరిస్థితి ఉందని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అని దీనిమీద నిపుణుల కమిటీ పరిశీలిచింది అని పేర్కొన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ తో అక్కడ రెస్టారెంట్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాము అని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: