బద్వేల్ లో ప్రచారం చేసే కేంద్ర మంత్రులు వీరే...?

ఆంధ్రప్రదేశ్ లో బద్వేల్ ఉప ఎన్నికల్లో పెద్దగా మీడియాలో హైలెట్ కాకపోయినా ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎవరు ప్రచారం చేస్తారు ఏం చేయాలనే దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ నుంచి కేంద్ర మంత్రులు రంగంలోకి దిగే అవకాశం ఉందని ప్రధానంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం చేసే అవకాశం ఉందని అంటున్నారు.
అదేవిధంగా కర్ణాటకకు చెందిన కేంద్రమంత్రి అలాగే మధ్యప్రదేశ్ కు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు ప్రచారం చేసే అవకాశాలు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. అలాగే తెలంగాణ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ అలాగే మరికొంతమంది ప్రచారం చేయొచ్చు అనే వార్తలు వినపడుతున్నాయి. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ప్రచారానికి రావచ్చని అంటున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఆటు హుజురాబాద్ ఇటు బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: