జ‌గ‌న్ ప్ర‌సాదం వాస‌న చూశారా?

Garikapati Rajesh

ఇంద్ర‌కీలాద్రిపై దేవీ శ‌ర‌న్న‌వరాత్రులు విజయవంతంగా జరిగాయని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు.   అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలు నిర్వహించామ‌ని, చిన్నచిన్న పొరపాట్లు ఉంటే స‌వ‌రిస్తామ‌న్నారు. తిరుమల, ఇంద్రకీలాద్రి లో జగన్ పర్యటనపై లోకేష్ వ్యాఖ్యలకు మంత్రి వెల్లంపల్లి స‌మాధానం చెప్పారు. ముఖ్యమంత్రిపై టీడీపీ నేతలు అసత్య ప్ర‌చారాలు చేస్తున్నార‌ని,  చంద్రబాబు దేవుళ్ళు, హిందూమతం  గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని, ఆయ‌న బూట్లు వేసుకుని ఆలయాలకు వెళ‌తార‌ని, అటువంటి బాబు జ‌గ‌న్‌ను విమర్శిండం వింత‌గా ఉందన్నారు. తిరుమలలో ప్రసాదాన్ని సీఎం కళ్లకద్దుకుంటే వాసన చూస్తున్నారని ప్రచారం చేశార‌ని, చంద్రబాబు హయాంలో దేవాలయాలను కూల్చివేశారని, కానీ జ‌గ‌న్  దేవాలయాలయను క‌ట్టిస్తున్నార‌నే విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌న్నారు. 23 సీట్లు ఉన్నతెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో మూడు సీట్ల‌కు ప‌రిమిత‌మ‌వుతుంద‌న్నారు. ప్ర‌జ‌లు ఇప్ప‌టికే తెలుగుదేశం పార్టీని ఎక్క‌డుంచాలో అక్క‌డుంచార‌ని, ఇదే విధానాల‌తో ముందుకు వెళితే ఆ మూడుసీట్లు కూడా రావ‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: