క‌ళా'మా'త‌ల్లి: పండ‌గ విరామం ఇచ్చారా?

Garikapati Rajesh

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల ర‌గ‌డ ముగిసిపోయింద‌నుకుంటున్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత కూడా అంద‌రూ ఇలాగే అనుకున్నారు. కానీ మీడియా స‌మావేశంలో ప్ర‌కాష్ రాజ్ అస‌లు క‌థ ఇప్పుడు ప్రారంభ‌మ‌వుతోంది అన్న‌ప్పుడే వీరంతా ఏదో చేబోతున్నారు.. ఏదో ప్ర‌ణాళిక‌లో ఉన్నారు అనిపించింది. అందుకు త‌గ్గ‌ట్లుగానే ఆ త‌ర్వాత రోజు ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ త‌ర‌ఫున గెలిచిన 11 మంది రాజీనామాలు చేశారు. అయితే వాటిని ఆమోదించేది లేద‌ని విష్ణు స్ప‌ష్టం చేశారు. మా స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన నాగ‌బాబును, ప్ర‌కాష్‌రాజ్‌ను వ్య‌క్తిగ‌తంగా క‌లిసి మాట్లాడ‌తాన‌న్నారు. అయితే ఒక వ్యూహం ప్ర‌కారం ఒక ప్ర‌ణాళిక ర‌చించుకొని ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ రాజీనామాలు స‌మ‌ర్పించిన‌ట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పుడు కూడా ఎందుకు సైలెంటుగా ఉన్నారు అనే సందేహం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌ల‌కు క‌లుగుతోంది. ద‌స‌రా పండ‌గ‌దినాలు కాబ‌ట్టి మూడురోజులు విరామం ఇచ్చిన‌ట్లుగా భావించాల్సి ఉంటుంది. అంటే ద‌స‌రా ముగిసిన త‌ర్వాత వీరంతా ఏదో ఒక ప్ర‌ణాళిక‌తో ముందుకు వ‌చ్చే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

maa

సంబంధిత వార్తలు: