ఆ విషయం గురించి నేను చెప్పలేను : మా ఎన్నికల అధికారి

Surya
టాలీవుడ్ మా ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపించిన విషయం అందరికి తెలిసిందే . మంచు విష్ణు మా అధ్యక్షుడిగా గెలిచారు కూడా. మరి ఏమైందో ఏమో కానీ ప్రకాష్ రాజ్ ప్యానెల్ మా నుండి పూర్తిగా తప్పుకున్నారు దానికి ప్రధాన కారణం మాజీ మా అధ్యక్షుడు నరేష్ అనే వాదన వినిపిస్తుంది. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి అనసూయ భారీ మెజారిటీ తో గెలిచిందని వార్తలొచ్చాయి తీరా చూస్తే అనసూయ ఓడి నట్లు వార్తలొచ్చాయి. ఈ విషయమై ఇప్పటికే అనసూయ న్యాయం కోసం కోర్ట్ కి వెళతానని చెప్పింది.అనసూయ ఓటమి గురించి మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ ని ప్రశ్నించగా. 


తాను బ్యాలెట్ ను ఇంటికి తీసుకువెళ్ళలేదు కానీ బ్యాలెట్ బాక్స్ ఉన్న గది తాళాలు మాత్రమే ఇంటికి తీసుకు వెళ్లానని చెప్పారు. అనసూయ గెలిచినట్లు అక్టోబర్ 10 న ఏమి అనౌన్స్ మెంట్ చేయలేదు . పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఆమె గెలిచిందని ఎలా ముందుగానే నిర్ణయిస్తారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ రాజీనామా గురించి అడుగగా ఆ విషయం ఎన్నికల సంఘానికి సంబంధించింది కాదు అని స్పష్టం చేశారు . ఆ రాజీనామాలు కేవలం ప్రస్తుత మా అధ్యక్షుడు విష్ణు చూసుకోవాలి . ఆ విషయం పై తాను మాట్లాడలేనని చెప్పారు. తనపై వస్తున్న అబద్దపు ప్రచారం కేవలం వారి దురుద్దేశమే అని చెప్పాడు

మరింత సమాచారం తెలుసుకోండి:

MAA

సంబంధిత వార్తలు: