మేము సన్నాసి అయితే పవన్ నిర్మాతలు కూడా సన్నాసులే; ఏపీ మంత్రి

గులాబ్ తుఫాన్ , ప్రభావంతో భీమిలి, మత్స్యకార గ్రామం, లోతట్టు ప్రాంతమైన మంగమరి పేట ను సందర్శించిన మంత్రి అవంతి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి మంత్రుల పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి అని క్షమాపణ చెప్పాలి అన్నారు ఆయన. పవన్ కళ్యాణ్ రాష్ట్రం లోనే, ఉండరు రాష్ట్రం గురించి మాట్లాడతారు అని మండిపడ్డారు. ఆయన సినిమాలన్నీ ఫారెన్ లోనే తీస్తారు ఏపీ లో ఎందుకు తీయరు అని ప్రశ్నించారు.
 పెద్దలు చిరంజీవి,  మోహన్ బాబు పై కూడా ఆయన మాట్లాడిన తీరు సరైంది కాదు అన్నారు. మంత్రులను సన్నాసులు అంటున్నారు అని ఆయనతో సినిమా పెద్దలు అందరూ సన్నాసులు ఆయన అర్థమా అని నిలదీశారు. ఆన్లైన్ విధానం పై ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారు అన్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత దూషణలు బూతులు మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: