ఆ కేంద్ర మంత్రి చుట్టూ కేసీఆర్...?

తెలంగాణా సిఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలు ఇప్పుడు బాగా హైలెట్ అవుతున్నాయి. ఆయన ఎందుకు వెళ్తున్నారు అనేది మీడియాకు చెప్తున్నా వెళ్ళే కారణం అది కాదని కామెంట్ చేయడం మనం చూస్తున్నాం. తాజాగా మరోసారి సిఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. 2 గంటలకు కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకవత్ ను సిఎం కేసీఆర్ కలిసి పలు అంశాల గురించి చర్చించారు.
రాష్టానికి సంబంధించిన పలు ప్రొజెక్టుల పై చర్చ జరిగింది. ఈ నెలలో రెండోసారి గజేంద్ర సింగ్ షేకవత్ తో భేటి అవుతున్న సీఎం కేసీఆర్... జల వివాదం గురించే అంటున్నారు. గత భేటి సందర్భంగా 5 అంశాల పై గజేంద్ర సింగ్ షేకవత్ కి లేఖను ఇచ్చారు. రేపు కేంద్ర హోంశాఖ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిఎం కేసీఆర్ పాల్గొంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: