కర్నూల్ జిల్లాలో జంట హత్యల కలకలం..అక్రమ సంబంధం పెట్టుకున్నారని..!

వివాహేతర సంబంధాలు హత్యలు... దాడులకు కారణం అవుతుంటాయి. అక్రమ సంబంధాల వల్ల ఎక్కడో ఒక దగ్గర తరచూ దారుణాలు భయట పడుతూనే ఉంటాయి. దాంతో రెండు కుటుంబాలు కూడా ఇబ్బందుల్లో పడుతూ ఉంటాయి. కొన్ని ఘటనల్లో పిల్లలు కూడా తల్లి తండ్రులు చేసిన తప్పులకు బలి అవుతునే ఉన్నారు. తాజాగా కర్నూల్ జిల్లాలో కూడా అలాంటి ఘటనే వెలుగు చూసింది.

భార్య తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనే ఆరోపణలతో ఇద్దరిని దారుణంగా హతమార్చారు. కర్నూల్ జిల్లా సీ పీ నగర్ లో ఈ దారుణం చోటు చేసుకుంది.  ఓబులేసు, చిన్ని అనే ఇద్దరిని దుండగులు అతి దారుణంగా నరికి చంపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకోగా...చిన్ని, ఓబులేసు ను తామే చంపామని దుండగులు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. అంతే కాకుండా అక్రమ సంబంధం వల్లనే ఇద్దరినీ కూడా చంపమని దుండగులు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: