జగ్గారెడ్డి కామెంట్స్: తెలంగాణా కాంగ్రెస్ చీలినట్టే...?

నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని చేసిన విమర్శలు సంచలనం అయ్యాయి. రాజకీయంగా ఈ కామెంట్స్ ఇప్పుడు తెలంగాణా కాంగ్రెస్ ను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మానిక్కం ఠాగూర్ ఆరా తీసి వివరాలు తెప్పించుకున్నారు. ఇంచార్జి సెక్రటరీ బోసురాజు తో సమాచారం తెప్పించుకున్నారు మాణిక్యం ఠాగూర్.
ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ రానున్న మాణిక్యం ఠాగూర్ ... ఈరోజు గాంధీభవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలపై పొలిటికల్ అఫైర్స్ కమిటీ లో చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. పీసీసీ చీఫ్ తీరును సమావేశంలో నిలదీసేందుకు రెడీ అయిన జగ్గారెడ్డి.. పలు ఫిర్యాదులు కూడా చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts

సంబంధిత వార్తలు: