నా రాజీనామా ఆయనకు వరం: ఈటెల

హుజూరాబాద్ లో ఎలా అయినా సరే గెలవాలని మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ సందర్భంగా తెరాస నేతలను లక్ష్యంగా చేసుకుని ఆయన ఆరోపణలు చేస్తున్నారు. మాజీ మంత్రి, బీజేపి నేత ఈటెల రాజేందర్ తాజాగా మరోసారి ఘాటు కామెంట్స్ చేస్తున్నారు. ఏం పదవి ఏం హోదా ఉందని కౌశిక్ రెడ్డి నాపై అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు అని నిలదీశారు.
నా రాజీనామా వల్లే కౌశిక్ రెడ్డికి ప్రగతి భవన్ లో ఎంట్రీ దొరికింది అని ఆయన  అన్నారు. పదవి కూడ రాబోతుంది అని ఆయన వెల్లడించారు. ఈ విషయం ప్రజలకు తెలుసు అని అన్నారు.  తెలంగాణ నీ అబ్బ జాగీరు కాదు కేసీఆర్ అంటూ ఘాటు కామెంట్స్ చేసారు. బీజేపీలో ఉన్న వారికి దళిత బందు ఇవ్వరా అని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts

సంబంధిత వార్తలు: