వై వైవీ: శ్రీవారి భక్తులకు అనుకోని కష్టం

తిరుమల విషయంలో అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నా సరే అధికారులు మాత్రం మారడం లేదు. పెద్ద పెద్ద తప్పులు చేస్తూ శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులను నానా ఇబ్బందులు పెడుతున్నారు. తాజాగా జరుగుతున్న వ్యవహారం మరోసారి ఇబ్బందికరంగా మారింది. టీటీడీ అనాలోచిత నిర్ణయం తో తిరుపతిలో శ్రీవారి భక్తులకు కష్టాలు మొదలయ్యాయి.
భక్తులకు సమాచారం ఇవ్వకుండా శ్రీనివాసంలో టోకెన్స్ ఇవ్వటం ఆపేశారు అధికారులు. ఈ రోజు ఆన్లైన్ లో ఉచిత దర్శనం టోకెన్స్ ఇస్తుండటంతో  తిరుపతి లోని ఇంటర్నెట్ సేటర్స్ వద్ద వందలాదిగా చేరుకుంటున్న  భక్తులు... టోకెన్ ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతమందికి టికెట్స్ బుక్ చేయలేమని షాప్స్ మూసేశారు నిర్వాహకులు. టీటీడీ తీరుపై మండి పడుతున్న భక్తులు... కావాలనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అని భక్తులను ఇబ్బంది పెట్టడం సబబు కాదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

TTD

సంబంధిత వార్తలు: