ఏపీలో బయటపడిన మరో స్కాం...?
సీఎంఆర్ఎఫ్ నిధులు గోల్ మాల్ వ్యవహారం బయటకు వచ్చింది. ఏపీ సచివాలయంలో భారీ స్కామ్ ను గుట్టు రట్టుచేసింది. పేదల డేటా సేకరించి సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టించారు అని వెల్లడి అయింది. 50 మంది ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించారు. ప్రజాప్రతినిధుల పిఏలు , అనుచరుల పాత్రపై ఆరా తీస్తున్నారు. కేసులో పలువురు నిందితులను అరెస్ట్ చేసిన ఏసీబీ.. త్వరలోనే మరికొందరిని అరెస్ట్ చేయవచ్చు.