బిగ్ బ్రేకింగ్: ఏపీ ప్రభుత్వానికి హైకోర్ట్ బిగ్ షాక్...!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్ట్ ఊహించని షాక్ ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం కు సంబంధించి ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సస్పెండ్ చేసింది హైకోర్ట్. ప్రత్యేక ఆహ్వానితులను నియమించడాన్ని విపక్షాలు తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు కాగా నేడు దీనిపై విచారణ జరిగింది.
అలాగే పాలకమండలి సభ్యుల నియామకం పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీనికి సంబంధించి దాఖలైన పిటీషన్ లపై నేడు విచారణ జరిపి హైకోర్ట్ జీవోలను రద్దు చేసింది. దాదాపుగా 80 మందిని పాలక మండలి సభ్యులు గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అందులో వైసీపీ నేతలు కూడా ఉన్నారు. దీనిపై తీవ్ర స్థాయిలో విపక్షాలు ఫైర్ కావడమే కాకుండా మండలిని భ్రష్టు పట్టిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: