డ్రగ్స్ విచారణకు తరుణ్, మెయిన్ టాపిక్స్ ఇవే...?

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కాసేపటి క్రితం తరుణ్ విచారణ మొదలయింది. తరుణ్ ను విచారిస్తున్న ముగ్గురు ఈడీ అధికారుల బృందం... కెల్విన్ తో సంబందాలు, బ్యాంక్ లావాదేవీలు పై ఆరా తీస్తున్నారని సమాచారం. బ్యాంక్ స్టేట్మెంట్లు ను ఈడీ అధికారులకు తరుణ్ అందించాడు. 2017 డ్రగ్స్ కేసులో తరుణ్ ఇచ్చిన స్టేట్మెంట్ అంశాలు ఆధారంగా అధికారులు అతన్ని ప్రశ్నిస్తున్నారు.
మనీ ల్యాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన పై తరుణ్ ను అధికారులు విచారిస్తున్నారు. 2017 జూలై 19 స్వచ్ఛంద ఎక్సైజ్ శాఖ కు బయో సాంపిల్స్ ను తరుణ్ ఇచ్చాడు. తరుణ్ ఇచ్చిన బయో సాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు లేనట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రీపోర్ట్  ఇచ్చింది. తరుణ్ తో పాటుగా మరికొందరు టాలీవుడ్ ప్రముఖులకు కూడా విచారణను ఎదుర్కొంటున్నారు. త్వరలో మరికొందరిని విచారించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: