ఆర్టీసీని ఏం చేద్దాం?

Chaganti
ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు అధ్యక్షతన, ఆర్టీసీ పరిస్థితి పై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం కొనసాగుతోంది, ప్రభుత్వ సహకారంతో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మీద అటు కరోనా ఇటు పెరిగిన డీజిల్ రేట్ల భారం నేపథ్యంలో .తిరిగి పుంజుకోవడానికి అవలంభించాల్సిన విధి విధానాలపై సమావేశం  కొనసాగుతోంది. ఈ సమావేశంలో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్,రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్,  ఎమ్మేల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, సైదిరెడ్డి, , ఆర్టీసీ ఎండీ సజ్జాన్నర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, రవాణా శాఖ కార్యదర్శి సునీల్ శర్మ, ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణ రావు ఇతర ముఖ్య రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: