ఆపరేషన్ చేసి దూది వదిలేసారు, చివరకు హాస్పిటల్ కు వెళ్తే...!

కొంత మంది వైద్యులు చేసే తప్పులు రోగుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తాజాగా ఒక ఘటన తెలంగాణాలో సంచలనం అయింది. భువనగిరి కేకే నర్సింగ్ హోమ్ లో దారుణ ఘటన జరిగింది. సీజరింగ్ చేసే సమయంలో మహిళ కడుపులో కాటన్ మరిచిపోయారు వైద్యులు. ఏడాది కాలంగా తీవ్ర అనారోగ్యంతో మహిళ బాధపడుతుంది. పరిస్థితి విషమించడంతో హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.
అప్పటికే కడుపులో పాయిజన్ గా మారిన కాటన్... ఆమె మృతికి కారణం అయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మమత మృతి చెందింది. మమత కడుపులోంచి కాటన్ వెలికి తీసిన వైద్యులు... మరణానికి అదే కారణం అని వెల్లడించారు. ఘటనకు భాద్యులైన కేకే నర్సింగ్ హోమ్ ముందు మృతురాలి కుటుంబ సభ్యుల ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: