లైఫ్ లాంగ్ గుర్తుంటుంది, మసాజ్ అంటారా...?

జగన్ రెడ్డి ఫ్యాక్షన్ మూకలు రెచ్చిపోతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ప్రత్తిపాడు నియోజకవర్గం కొప్పర్రు గ్రామంలో టీడీపీ నాయకురాలు శారద గారి ఇంటి పై వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను అని ఆయన అన్నారు. రేపో మాపో జైలుకి పోయే గాలి గాడిని చూసుకొని రోడ్లపై ఆంబోతుల్లా తిరుగుతున్న ప్రతి ఒక్కడు జీవితాంతం గుర్తుండే శిక్ష అనుభవించడం ఖాయం అని హెచ్చరించారు.
వైసీపీ నాయకులు చేసే తప్పుడు పనులకు ఆహా...ఓహో అంటూ కితాబు ఇవ్వడం మాని పోలీసులు శారద గారి కుటుంబ సభ్యుల మీద విచక్షణారహితంగా దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేసారు. ఆ దాడిలో ఒక ఎస్సై కి కూడా గాయాలు అయ్యాయి అన్నారు ఆయన.  యధావిధిగా వైకాపా మసాజ్ అంటారా పోలీసు సంఘం వారు ? అంటూ ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: