వై వైవీ: ఎందుకీ పంచెల గొడవ...?

ప్రతి ఏటా శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో గద్వాల్ సంస్థానం వారు సమర్పించే ఎరువాడ జోడు పంచెలు తిరుమలకు చేరుకోవడం పై సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే ఎరువాడ జోడు పంచెలను గద్వాల్ సంస్థానదీశులు సిద్దం చేసి ఉంచారు అని తెలుస్తుంది. టీటీడీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎంతటికి టీటీడీ నుంచి పిలుపు రాకపోవడంతో గద్వాల్ సంస్థానం తరుపున టీటీడీని సంప్రదించినా అధికారుల నుంచి స్పందన కరువు కావడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
వచ్చే నెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేపధ్యంలో అనాది కాలంగా వస్తున్న సంప్రదాయాలను పాటించకపోవడం పై టీటీడీ పై విమర్శలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. ప్రభుత్వం, పాలక మండలి స్పందించి ఎరువాడ జోడు పంచెలను శ్రీవారికీ సమర్పించేలా ఆదేశాలు జారీ చెయ్యాలని గద్వాల్ సంస్థనాదీశులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

TTD

సంబంధిత వార్తలు: