పోలీస్ స్టేషన్ ముందు దీక్షకు దిగుతున్న షర్మిల...?

బోడుప్పల్ ఎక్సిబిషన్ గ్రౌండ్ వద్ద టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. వైఎస్ షర్మిల దీక్ష కు అనుమతి ఇవ్వని పోలీస్ ల తీరుపై తీవ్ర స్థాయిలో ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఆత్మహత్య చేసుకున్న రవీంద్ర కుటుంబాన్ని పరామర్శించి గ్రౌండ్ లోనే దీక్ష కు ఆమె దిగే అవకాశం ఉంది. ఎక్జిబీషన్ గ్రౌండ్ వద్ద భారీగా పోలీసులు మోహరించి ఎటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపడుతున్నారు.
స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితోనే సభ స్థలిని మార్చాలంటూ ఒత్తిడి తెస్తున్నారంటూ ఆరోపణలు చేసారు ఆమె పార్టీ నేతలు. ముందుగా అనుమతినిచ్చి చివరి నిమిషంలో అడ్డంకులు సృష్టిస్తున్నారని వైఎస్సార్ టిపి శ్రేణులు పోలీసులపై ఫైర్ అవుతున్నారు. ఆత్మహత్య చేసుకున్న రవీంద్ర నాయక్ కుటుంబాన్ని పరామర్శ అనంతరం మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు దీక్ష ఆమె దీక్ష చేపట్టే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts

సంబంధిత వార్తలు: