ఏపీ సర్కార్ కి స్పెషల్ కోర్టు షాక్?

Chaganti
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు ఎత్తివేతకి ప్రత్యేక కోర్టు నిరాకరించింది, హైకోర్టు అనుమతి లేకుండా ఎమ్మెల్యేలపై కేసుల ఉపసంహరణ కుదరదని కోర్టు  స్పష్టం చేసింది. ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డిపై కేసుల ఉపసంహరణకి అనుమతించాలంటూ ప్రభుత్వ న్యాయవాది పిటిషన్ దాఖలు చేసింది, తన ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ఫోర్జరీ పత్రాలు సృష్టించి మోసం చేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై గతంలో కేసు నమోదయింది, విజయవాడ ప్రత్యేక కోర్టులో పెండింగ్లో ఉన్న కేసుని తొలగించాలంటూ గత ఏడాది జూన్ లో ప్రభుత్వం జీవో జారీ చేసింది, ఈ జీవో మేరకు గోవర్ధన్ రెడ్డి పై కేసు ఉపసంహరణకి పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు అనుమతి లేకుండా ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణ కుదరదని, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేసింది ప్రత్యేక న్యాయస్థానం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: