విజయవాడ తాలిబన్లు ఎవరు?
కృష్ణా తీరాన వచ్చిపోయే వాహనాలను చూస్తూ నదిలో నీళ్లుంటే వాటిని చూస్తూ ఆనందించే ప్రజలకు ఊహించని విధంగా షాక్ తగిలింది. ఎక్కడో ఆఫ్గనిస్తాన్లో అరాచకంగా రాజ్యమేలుతోన్న తాలిబన్ల గురించి వార్తలు వింటుంటుడం, చూస్తుండటమేకానీ అటువంటి ప్రాంతానికి, విజయవాడకు లింకుటుందని ఊహించలేకపోయారు. కొద్దిరోజుల క్రితమే డ్రగ్స్ కు సంబంధించి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురిని ఈడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ వారు డ్రగ్స్ వాడుతున్నారని తెలిసిన ప్రజలకు అయోమయానికి గురయ్యారు. తాజాగా విజయవాడ సత్యనారాయణపురంలో ఆశి ట్రేడింగ్ పేరుతో నమోదైందని గుజరాత్లోని అధికారులు చెప్పారు. కానీ ఇక్కడ ఒక చిన్న కార్యాలయం ఉంది. ఏ సంబంధం లేకుండా ఇక్కడి చిరునామా ఇవ్వరు.. ఇక్కడి వ్యక్తుల ప్రమేయం లేకుండా విజయవాడ పేరు బయటకురాదు. తెలుగుదేశం పార్టీ నేతలేమో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడంవల్లే అంతర్జాతీయ మాఫియా విజయవాడకు చేరుకుంటోందని ఆరోపిస్తున్నారు. ఇంత భారీస్థాయిలో హెరాయిన్ దిగుమతి చేసుకుంటున్న బిగ్బాస్ ఎవరో బయటకు రావాలని, ఆ కోణంలో పోలీసుల దర్యాప్తు సాగాలని డిమాండ్ చేస్తున్నారు.