జనసేన అధినేత పవన్ కళ్యాణ పరిషత్ ఎన్నికల్లో జనసేన విజేతలకు అభినందనలు చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో జనసేన పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్ధులందరూ బలమైన పోరాటం చేశారని పవన్ కల్యాణ్ అభినందించారు. ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించిన ఫలితాల మేరకు మొత్తం 177 ఎంపీటీసీ, 2 జెడ్పీటీసీ స్థానాలను జనసేన అభ్యర్ధులు కైవసం చేసుకున్నారని పవన్ ప్రకటించారు.
పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన అభ్యర్ధులందరికీ జనసేన తరఫున మరియు తన తరఫున పవన్ కల్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ ఎన్నికలు ఎలాంటి పరిస్థితుల్లో జరిగాయన్న అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తమ దగ్గర ఉందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మరింది. అంతే కాకుండా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల ఫలితాలపై రెండు మూడు రోజుల్లో సంపూర్ణ విశ్లేషణతో స్పందిస్తానని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఇక పరిషత్ ఎన్నికల్లో జనసేన విజయంతో పార్టీలో కొత్త జోష్ నిండుకుంది.