కేటీఆర్ వ‌ర్సెస్ రేవంత్‌

Garikapati Rajesh

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌, ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతూనే ఉంది.  డ్రగ్స్  బెడదపై యువతలో అవగాహన కల్పించడానికి తాను ప్రారంభించిన వైట్ ఛాలెంజ్‌కు సిద్ధమా? అంటూ రేవంత్ స‌వాల్ విసిరారు. తాను ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉన్నానని, ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ పరీక్షకు రేవంత్‌రెడ్డి సిద్ధమా? అంటూ మంత్రి కేటీఆర్ తిరిగి స‌వాల్ చేశారు. మంత్రి కేటీఆర్ చెప్పిన విధంగా లై డిటెక్టర్ పరీక్షకు తాను సిద్ధంగా ఉన్నట్లు రేవంత్ ప్ర‌క‌టించారు.  త‌మతో పాటు కేసీఆర్ కూడా సహారా కుంభకోణం, ఈఎస్ఐ కుంభకోణం, సీబీఐ కేసులలో లై డిటెక్టర్ ప‌రీక్ష‌ల‌కు వ‌స్తారా? అని రేవంత్ రెడ్డి మ‌రో సవాల్ విసిరారు. రేవంత్‌పై కేటీఆర్ ఈరోజు హైకోర్టులో పరువునష్టం దావా వేయబోతున్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. టాలీవుద్ న‌టుల‌ను ఈడీ అధికారులు మాద‌క‌ద్ర‌వ్యాల‌కు సంబంధించిన కేసు విష‌యంలో విచారిస్తుండ‌టంతో కేటీఆర్‌, రేవంత్ మ‌ధ్య మాట‌ల యుద్ధం ప్రారంభ‌మైంది. ఈ వివాదం ఇంకెన్ని మ‌లుపులు తిర‌గ‌బోతోంద‌న్న ఉత్కంఠ అంద‌రిలో నెల‌కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: