రేపు ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయంలో టాలీవుడ్ పెద్దలతో ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో టాలీవుడ్ కు చెందిన సినిమా నిర్మాతలు..ప్రదర్శనకారులు మరియు పంపిణీదారులు కూడా పాల్గొనబోతున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆన్లైన్ టికెట్ వ్యవస్థ పై మరియు కరోనా మహమ్మారి వల్ల సినిమా పరిశ్రమ కు ఎదురైన ఇబ్బందులపై కూడా మంత్రి పేర్ని చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే రాష్ట్రంలో ఆన్లైన్ టికెట్ అమ్మకాలపై ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీస్కోలేదని మంత్రి పేర్ని నాని చెబుతున్నారు. దాంతో రేపు సినీ పెద్దలతో ఏర్పాటు చేస్తున్న సమావేశంలో ఆన్లైన్ సినిమా టికెట్ అంశం పై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఆన్లైన్ టికెట్ అమ్మకాల విషయం పై కొంత మంది విమర్శలు కురిపిస్తుండగా కొంత మంది సపోర్ట్ కూడా చేస్తున్నారు.