కడపలో సైలెంట్ షాక్ ఇచ్చిన టీడీపీ...?

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ని అధికారులు చాలా జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు. ఎక్కడా కూడా అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఘటనలు జరిగే ప్రాంతాల మీద ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఇక ఈ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ బహిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే కడప జిల్లాలో మాత్రం వైఎస్ కుటుంబానికి టీడీపీ షాక్ ఇచ్చింది.
కమలాపురం మండలం లో టిడిపి అభ్యర్ధులు దూసుకుపోతున్నారు. అధిష్టానం వద్దని చెప్పినా సరే పోటీకి దిగిన అభ్యర్ధులు... విజయం దిశగా అడుగులు వేస్తున్నారు. కమలాపురం మండలం పెద్దచెప్పలి టీడిపి ఎంపిటీసి స్ధానం లో... రెండవ రౌండుకే  1000 ఓట్లకు గాను 500 పై చిలుకు ఆధిక్యం లో  టిడిపి ఉండటం ఆశ్చర్యపరిచింది. టిడిపి రాష్ట్రకార్యదర్శి సాయినాధ్ శర్మ ఆధ్వర్యంలో టిడిపి కార్యక ర్తలు విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: