బై బై గణేష్: ఖైరతాబాద్ లో ఒక రేంజ్ సెక్యూరిటీ
దీనితో పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేసారు. మరికాసేపట్లో సెన్సేషనల్ థియేటర్ కి మహాగణపతి విగ్రహం చేరుకుంటుంది. బోనాలతో ఖైరతాబాద్ గణేషుడి శోభా యాత్రలో మహిళల సందడి ఎక్కువగా ఉంది. ఊరేగింపులో వేలాదిగా పాల్గొన్న భక్తులు... కరోనా జాగ్రత్తలు పాటించే విధంగా చర్యలు చేపట్టారు. బడా గణేషుడికి అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. ఇక హైదరాబాద్ పరిధిలో ఉన్న మంత్రులు, గ్రేటర్ అధికారులు అందరూ కూడా చాలా సీరియస్ గా దృష్టి పెట్టారు. నిమజ్జనం వద్ద కూడా చర్యలు చేపట్టారు.