రేపు ఏపీలో వైన్ షాప్ లు బంద్...!

జడ్పి ఎన్నికల కౌంటింగ్ పై జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేసారు.  10 లోకేషన్లలో కౌంటింగ్ జరగనుంది అని వివరించారు. 42 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశాం అన్నారు ఆయన. 34 స్థానాల్లో జడ్పిటిసి అభ్యర్థులు140, 362 ఎంపిటిసి స్థానాలకి 962 అభ్యర్థులు పోటీలో ఉన్నారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. 4979 మంది కౌంటింగ్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు అని అన్నారు.
ముగ్గురు లేదా నలుగురు అధికారులు ఒక్కో బెంచికి ఉంటారు అన్నారు. కోవిడ్ నిబంధనాలకి అనుగుణంగా కౌంటింగ్ ఉంటుంది అని ఆయన స్పష్టం చేసారు. రెండు డోసులు వేసుకున్న వారికి, టెస్టుల్లో నెగటివ్ ఉన్న వారికి మాత్రమే కౌంటింగ్ హాల్లోకి అనుమతిస్తాం అన్నారు. 13 లక్షల పై చిలుక ఓట్లని రేపు లెక్కిస్తాం అని తెలిపారు. మద్యం దుకాణాలు మూసివేయాలి అని స్పష్టం చేసారు. సంబరాలు, బాణసంచా పేల్చకూడదు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: