వాళ్లు గాడిదలైతే.. రేవంత్ ఎవరు? కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గాడిదలైతే ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఎవరు? అడ్డగాడిదా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్రెడ్డి దూకుడు రియల్ ఎస్టేట్ వెంచర్ లాంటిదని, మార్కెట్ చేసుకునే హడావిడేకానీ అంత సీన్ లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల, బీఎస్పీ నేత ప్రవీణ్కుమార్ జాతీయ పార్టీలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. షర్మిల సీఎం కేసీఆర్పై కాకుండా బీజేపీ, కాంగ్రెస్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని, సీఎంను నోటికొచ్చినట్లు తిడితే రాజద్రోహం కేసులు పెట్టడానికి వెనకాడమన్నారు. టీఆర్ఎస్ ఓట్లు చీల్చి జాతీయ పార్టీలకు న్యాయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉండే రాష్ట్రాల్లో దమ్ముంటే బీసీబంధు పెట్టాలని కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణకు నిజమైన ముక్తి రాష్ట్రం ఏర్పడటంతోనే లభించిందని, సాయుధ పోరాటం గురించి మాట్లాడే హక్కు భారతీయ జనతాపార్టీకి లలేదని, ఆనాడు సాయుధ పోరాటం చేసింది కమ్యునిస్టులేనని కేటీఆర్ తెలిపారు.