అసలు చంద్రబాబు ఇంటి దగ్గర ఏం జరిగింది...? టీడీపీ ఏం అంటుంది...?

చంద్రబాబు నివాసం వద్ద వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన దాడి సంచలనం అయింది. దీనిపై మూడు ఫిర్యాదు లు ఇచ్చిన టీడీపీ నేతలు.... ఎమ్మెల్యే జోగి రమేష్ కర్రలు మరణాయుధాలు తో దాడి కి ప్రయత్నం చేసారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు ని ఉద్దేశించి జోగి రమేష్ అసభ్య పదజాలంతో దూషణ లు చేయడమే కాకుండా చంపేస్తాము అని హెచ్చరికలు చేశారు అని వివరించారు.
డీజీపీ గౌతం సవాంగ్ మద్దతు మాకు ఉందంటూ దాడికి యత్నించారు అని దాడి ని అడ్డుకోవడానికి టీడీపీటిడిపి నేతల పై దాడులు చేశారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. లాయర్ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ... చంద్రబాబు ఇంటి పై జరిగిన దాడి పై ఫిర్యాదు చేసాము అని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా నే దాడి చేసినట్లు కనిపిస్తుంది అన్నారు. జోగి రమేష్ పై సెక్షన్ 307 పై కేసు నమోదు చెయ్యాలి అని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: