అసలు చంద్రబాబు ఇంటి దగ్గర ఏం జరిగింది...? టీడీపీ ఏం అంటుంది...?
డీజీపీ గౌతం సవాంగ్ మద్దతు మాకు ఉందంటూ దాడికి యత్నించారు అని దాడి ని అడ్డుకోవడానికి టీడీపీటిడిపి నేతల పై దాడులు చేశారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. లాయర్ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ... చంద్రబాబు ఇంటి పై జరిగిన దాడి పై ఫిర్యాదు చేసాము అని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా నే దాడి చేసినట్లు కనిపిస్తుంది అన్నారు. జోగి రమేష్ పై సెక్షన్ 307 పై కేసు నమోదు చెయ్యాలి అని కోరారు.