నీళ్ళ గొడవ: కీలక అడుగు పడినట్టే...?
సిఐఎస్ఎఫ్ భద్రత అంశాన్ని చివరగా చర్చిద్దామని ఉప సంఘం ఈ సందర్భంగా తెలిపింది. బనక చెర్ల హెడ్ రెగ్యులేటర్ బోర్డు పరిధిలోకి వద్దన్న ఏపీ, బోర్డు పరిధిలోనే ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం కోరగా... తానే స్వయంగా వచ్చి అటువంటి అంశాలను పరిశీలిస్తా అని కన్వీనర్ పిళ్ళై తెలిపారు. ఈ అంశాలపై వచ్చే గురువారం మరోసారి బోర్డు మీటింగ్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు.