ఏపీలో ఇళ్ళ స్థలం రాలేదా...? అయితే గుడ్ న్యూస్...!

ఏపీ గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రతిపక్షాలు సీయం జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు అని ఆయన విమర్శలు చేసారు. ఇటువంటి పనులు మానుకుంటే చాలా మంచిది అని ఆయన సూచించారు. లబ్ధిదారులతో ప్రత్యేకంగా చర్చించి నేరుగా వారి అభిప్రాయాలను తెలుసుకుంటానని అన్నారు.
ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు రాసి లబ్ధిదారులను ఆందోళనకు గురి చేస్తున్నారు  అని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఒక్క సెంటు భూమి కూడా ఎవరికీ ఇవ్వలేదన్నారు ఆయన. ఇవే పత్రికలు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పై కథనాలు రాసి అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు అని నిలదీశారు. నిరుపేదలకు సంబంధించి ప్రతిపక్షాలు ఒక్కో ఇంటి ఖర్చు 5 లక్షలు అవుతాయని ప్రచారం చేస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆలోచించి ఒక లక్ష 80 వేల రూపాయలతో నేరుగా ఇల్లు కట్టించి ఇస్తుంది అని స్పష్టం చేసారు. రాష్ట్రంలో ఇంకా స్థలాలు రాని నిరుపేదలు ఉంటే, వారికి  ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని మంత్రి పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: