ఏపీ హైకోర్టుకి అశోక్ గజపతి రాజు

Mamatha Reddy
 మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం మాన్సస్ ట్రస్ట్ కి సంబంధించిన ఈఓ వెంకటేశ్వరరావు ట్రస్టు వ్యవహారాలపై ఎలాంటి సహకారం అందించడం లేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ సంస్థ చైర్మన్ అశోక్ గజపతిరాజు.  కనీసం ఉద్యోగులకు జీతాలు సైతం అందించడం లేదంటూ తన పిటిషన్ లో పేర్కొన్నారు గజపతిరాజు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు  పిటిషన్ పై విచారణ నిర్వహించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది.  ఇక రేపు ఆదివారం కావడంతో విచారణ సోమవారం నాడు విచారణ జరిపించే అవకాశాలున్నాయి. ఇదివరకే అశోక గజపతి రాజు విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సంస్థ లో పని చేసే 10 మంది ఉద్యోగులపై కేసు నమోదు చేశారు. ఈఏ వెంకటేశ్వరరావు ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అంటూ 19 నెలలుగా ఉద్యోగులకు జీతాలు లేవంటూ పోలీస్ స్టేషన్ లో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: